Tuesday, May 7, 2024

పునీత్ పేరుతో మొక్క నాటిన విశాల్..గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన న‌టులు..

ఎనిమీ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా హైద‌రాబాద్ కి వ‌చ్చారు త‌మిళ స్టార్ హీరోలు ఆర్య‌, విశాల్..వీరితో పాటు హీరోయిన్ మిర్నాళిని ర‌వి కూడా వ‌చ్చారు. కాగా తెలంగాణ‌లో గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంలో సినీ..రాజ‌కీయ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే రీసెంట్ గా మ‌ర‌ణించిన కన్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పేరుతో నటుడు విశాల్ మెుక్కని నాటారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ఆర్య కూడా మెుక్క నాటారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి మిర్నాళిని రవి పాల్గొని మెుక్క నాటి నీళ్లు పోశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement