Thursday, May 2, 2024

మంత్రి మేకపాటి మృతిపై తెలంగాణ మంత్రి తలసాని విచారం

ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై పలు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని సంతాపం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం అని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడం అత్యంత భాదాకరం అని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులు దేవుడు దైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement