Monday, April 29, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్..త‌ల్లి శాంత‌మ్మ క‌న్నుమూత‌..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట మ‌రో విషాదం నెల‌కొంది. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ క‌న్నుమూశారు. హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు. శాంతమ్మ అంత్య‌క్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ యేడాదే ఫిబ్రవరిలో శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్(73) మృతి చెందారు. వయసుమీద పడటంతో, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ గౌడ్, ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ మ‌ర‌ణించారు. ఇప్పుడు త‌ల్లి కూడా మ‌ర‌ణించ‌డంతో వారి ఇంట విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement