Saturday, April 20, 2024

Covid-19: దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరగా.. ఇందులో 3,36,41,175 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,61,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,57,740 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారు. అదే సమయంలో 13,543 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 98.19 శాతం ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రభ ఎఫెక్ట్: రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Advertisement

తాజా వార్తలు

Advertisement