Wednesday, May 8, 2024

విద్యుత్ ఎస్ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా రెడ్డి

వికారాబాద్, మే 20 (ప్రభ న్యూస్) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్తు సూపరింటెండెంట్ ఇంజినీర్ భవన కార్యాలయానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. 18వేల చదరపు గజముల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవనానికి మంత్రి భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, శాసనసభ్యులు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పాతూరి రామ్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, విద్యుత్ శాఖ ఎస్ఈ వి.జయరాజు, డీఈ ఆపరేషన్ సంజీవ్, ఏడీ ఆపరేషన్ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement