Tuesday, May 14, 2024

అయ్యో….అయ్యో!! అవసరమా ఈ విన్యాసాలు మంత్రిగారు

మంత్రి మల్లారెడ్డి కాలు జారారు. కాలు జారాటం అంటే ఆ కాలు జారాటం కాదండి…అదుపుతప్పి కిందపడ్డారు. కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్లి అవతలి వాళ్ళని ముట్టేయాలన్న ఆత్రుత తో మల్లారెడ్డి కిందపడ్డారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో చర్ల ఆంజనేయులు యాదవ్ స్మారకార్థం గా నిర్వహిస్తున్న 68 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళలు & పురుషుల కబడ్డీ పోటీలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్,చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.

క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కబడ్డీ ఆడారు. అదే క్రమంలో మంత్రి మల్లారెడ్డి కాలుజారి క్రింద పడ్డారు వేంటనే మిగతా వారు పైకి లేపి పక్కకు తీసుకెళ్లారు. భగవంతుని దయవల్ల మంత్రి మల్లారెడ్డి గారికి ఏమి కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement