Monday, April 29, 2024

ఆటోడ్రైవర్ అన్నాదురైని అభినందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేటీఆర్ తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురైను అభినందించారు. ఆటో డ్రైవ‌ర్ అన్నాదురై ఇటీవల తన ఆటోలో ఐపాడ్, ల్యాప్‌ల్యాప్, ఫ్రిజ్, స్నాక్న్, కూల్‌డ్రింక్స్, ఉచిత వైఫై, మ్యాగజైన్‌లను వంటి పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాడు. దీంతో అన్నాదురై ఆటోలోని సౌకర్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు డబ్బు కంటే కస్టమర్ల సంతోషమే ముఖ్యమని.. అందుకని కస్టమర్ల కోసం పలు లగ్జరీ గాడ్జెట్స్‌ను అందుబాటులో ఉంచానని అన్నాదురై స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్నాదురై గత 10 ఏళ్ల నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రయాణికుల అవసరాలు తెలుసుకుని తన ఆటోలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాడు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వచ్చింది. చెనైకి చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై తన ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని… ఇది గొప్ప ఆలోచన అంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement