Thursday, May 9, 2024

సినిమా థియేటర్‌లో సందడి చేసిన తెలంగాణ మంత్రి

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సినిమా థియేటర్‌లో సందడి చేశారు. బుధవారం సూర్యాపేటలోని ఈశ్వర్ మూవీ థియేటర్‌లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించిన ‘రైతన్న’ సినిమాను ఆయన వీక్షించారు. రైతుల జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీక్షించాలని, ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఆదరించాలని కోరారు. పేదల కష్టాలు, రైతుల బాధలను ఈ మూవీలో ఆర్.నారాయణమూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని మంత్రి జగదీష్‌రెడ్డి కొనియాడారు.

ఈ వార్త కూడా చదవండి: దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement