Thursday, May 2, 2024

సూర్యాపేటలో మ‌హిళా సంక్షేమ దినోత్స‌వ వేడుక‌ల‌ను ప్రారంభించిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా రాష్ట్ర వతరణ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. దశాబ్ది ఉత్సావాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ సంబురాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మాహిళా లోకం పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్యాక్రమనికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షత వ‌హించారు. జ్యోతిని వెలిగించి మహిళా సంక్షేమ దినోత్సవం సంబురాల‌ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా బతుకమ్మలతో మహిళల ఆట-పాటలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

కార్య‌క్ర‌మంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, పెన్పహాడ్ జడ్ పి టి సి మామిడి అనిత, చివ్వేంల ఎంపీపీ ధరవత్ కుమారి, ఆత్మకూరు తహసీల్దార్ పుష్ప, మున్సిపల్ కొన్సిలర్స్ ఆకుల కవిత, మాలోతు కమల, కుంభం రేణుక, జాటోతు లక్ష్మీ, నిమ్మల స్రవంతి, కొండపల్లి భద్రమ్మ, ధరవత్ నీలాబాయి, బత్తుల లక్ష్మీ, జ్యోతి శ్రీవిద్య, జిల్లా సంక్షేమ శాఖాధికారిణి జ్యోతిపద్మ, ఎస్సి కార్పొరేషన్ ఈడీ శిరీష, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement