Friday, May 3, 2024

కంది పంచాయ‌తీ అధికారుల‌పై మంత్రి హ‌రీశ్ రావు ఫైర్..

కంది : సంగారెడ్డి జిల్లా కంది పంచాయ‌తీ అధికారుల‌పై మంత్రి హ‌రీశ్ రావు ఫైర్ అయ్యారు. కంది మండ‌లం మీదుగా పోతున్న జాతీయ ర‌హ‌దారిపై మురుగు నీరు ప్ర‌వ‌హించ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సంగారెడ్డి వ‌స్తుంటే మురుగు నీరు స్వాగ‌తం పలుకుతుంద‌ని అధికారుల‌పై మండిప‌డ్డారు. ప్ర‌తి రోజు మీరు వ‌చ్చే దారిలో ఉన్న స‌మ‌స్య‌లు క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ఇలా జాతీయ ర‌హ‌దారిపై మురుగు నీరు పారితే సంగారెడ్డి జిల్లా గౌర‌వం పోతుంద‌న్నారు. వెంట‌నే మురుగు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement