Wednesday, May 8, 2024

మంత్రి గంగుల కోలుకోవాలని – పూజలు

కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ త్వరగా కోలుకోవాలని జికే యూత్ అధ్యక్షులు మొగిలోజు వెంకట్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మొగిలోజు వెంకట్ మాట్లాడుతు గత కొన్ని రోజులుగా నగరం లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రజా క్షేత్రంలో ఉంటూ మంత్రి ప్రజలకు సేవలు అందించారన్నారు. ఈ సందర్భంలో కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారన్నారు.త్వరగా కోలుకోని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎప్పటిలాగే వారు ప్రజలకి సేవలందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో. సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, మోగిలోజు వెంకట్, పొన్నం రాజు, పుసాల శ్రీకాంత్, బట్టు వరప్రసాద్, గందే కల్పన, వరుణ్ రావు, వినయ్, హరికృష్ణ వర్మ, శ్రీహరి, ప్రదీప్, అఖిల్, గోనె అనిల్, శ్రవణ్. లక్కాకుల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement