Saturday, May 11, 2024

సముద్రంలో లక్షల కోట్ల బంగారం, 200 ఏళ్ల క్రితం మునిగిన నౌకల శిథిలాల్లో గుర్తింపు

రెండు వందల సంవత్సరాల క్రితం మునిగి పోయిన రెండు నౌకల శిథిలాల క్రింద బంగారు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నట్లు కొలంబియా అధికారులు శుక్రవారం గుర్తించారు. ఆ బంగారం విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 1.32 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. బంగారంతో పాటు ఇతర వస్తువులు కూడా గుట్టలుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 1708లో స్పెయిన్‌ యుద్ధం సమయంలో ఆ దేశానికి చెందిన శాన్‌, జోన్‌ అనే భారీ నౌకలు బ్రిటీష్‌ దాడుల్లో మునిగిపోయాయి.

ఆ సమయంలో 600 మంది ప్రయాణీకులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఉన్నాయి. ఆ నౌక శిథిలాలను 2015లో గుర్తించారు.అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్న కొలంబియా ప్రభుత్వం ఎట్టకేలకు వాటిని గుర్తించింది. కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ వాహనం ఉన్నట్లు కొలంబియాకు చెందిన అత్యాధునిక రిమాెెట్‌ గుర్తించింది. ఈ నౌకలపై పరిశోధనలు జరపనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement