Monday, April 29, 2024

‘మా’ త‌ర‌పునే చిరూ , జ‌గ‌న్ భేటీ – నాగార్జున‌

మా అంద‌రి గురించే మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యార‌ని టాలీవుడ్ హీరో నాగార్జున అన్నారు. కాగా బంగార్రాజు చిత్రం విడుద‌లలో బిజీగా ఉండ‌టం వ‌ల్లే చిరంజీవితో క‌లిసి వెళ్ల‌లేక‌పోయాన‌ని ఆయ‌న చెప్పారు. జ‌గ‌న్ తో , చిరంజీవి భేటీ అవుతార‌ని గ‌తంలోనే నేను చెప్పాన‌ని జ‌గ‌న్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అని నాగార్జున చెప్పారు. అయితే ఈ భేటీ తరువాత టికెట్ రేట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు, ఇటు రాజకీయ వ్యక్తుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. వీటన్నింటికి ఈ భేటీతో సమాధానం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement