Monday, April 29, 2024

రాష్ట్రపతి ఎన్నికపై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు

మెగా బ్రదర్స్‌లో ఒకడైన నాగబాబు రాజకీయాలపై ఇటీవల తరచుగా మాట్లాడుతున్నాడు. తాజాగా ఆయన రాష్ట్రపతి ఎన్నికపైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలని ఓ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఎత్తుకు పైఎత్తు వేసేవారు కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలని నాగబాబు ఆకాంక్షించాడు.

ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా రాష్ట్రపతి పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శరద్ పవార్ స్వయంగా కొట్టిపారేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా వచ్చే ఏడాది జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది.

ఈ వార్త కూడా చదవండి: సర్కారు వారి బ్లాస్టర్ మాములుగా లేదు…నయా రికార్డ్

Advertisement

తాజా వార్తలు

Advertisement