Sunday, May 5, 2024

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి టీటీడీ అధికారులు ఘ‌న స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement