Thursday, April 25, 2024

ర‌ష్యా బాంబ‌ర్ బేస్ పై డ్రోన్ దాడి చేసిన ఉక్రెయిన్.. ముగ్గురు మృతి

ఉక్రెయిన్ డ్రోన్ ర‌ష్యాలోని ఏంజిల్స్ బాంబ‌ర్ బేస్ పై దాడి చ‌చేయ‌గా..ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఆ డ్రోన్‌ను కూల్చివేసింద‌ని, కానీ ఆ డ్రోన్ శిథిలాలు కింద‌ప‌డ‌డం వ‌ల్ల ముగ్గురు మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. స్ట్రాట‌జిక్ బాంబ‌ర్ విమానాల బేస్‌గా ఏంజిల్స్ విమానాశ్ర‌యం ప‌నిచేస్తున్నది. బోర్డ‌ర్‌కు 500కిలోమీట‌ర్ల దూరంలో ఆ బేస్ ఉంది. లో ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్‌ను కూల్చివేసిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. స‌ర‌టోవ్ ప్రాంతంలో ఆ బేస్ ఉంది. డ్రోన్ దాడి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement