Sunday, May 5, 2024

Delhi: తెలంగాణ భ‌వ‌న్‌లో సామూహిక జ‌న‌గ‌ణ‌మ‌న‌.. సీఎం కేసీఆర్ పిలుపునకు స్పంద‌న‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జాతీయ గీతం జనగణమన ఆలాపనతో దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ మార్మోగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపు మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం, భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ విక్రమ్ సింగ్ మాన్ ఆధ్వర్యంలో జనగణమన గీతాలాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భవన్ అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజలు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement