Monday, April 29, 2024

Chhattisgarh: 12 వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు

మావోయిస్టులు 12 వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.రాష్ట్రంలోని బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోయిస్టులు… రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది… 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు.
బామ్రా గఢ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రోడ్లు వేస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈరోడ్డు నిర్మాణం పూర్తయితే వారి ఉనికికే ప్రమాదం ఏర్ప‌డుతుంద‌ని భావించి… వాహనాలను తగలబెట్టినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement