Monday, May 13, 2024

Breaking: ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

మావోయిస్టులు మరోసారి దాడికి పాల్ప‌డ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. జిల్లాలోని దర్భ డివిజన్‌ మలంగేర్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టుల మధ్య గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయని ఏఎస్పీ రాజేంద్ర జైస్వాల్ తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. మలంగేర్‌లో ఈ మధ్యే ఏర్పాటు చేసిన‌ సీఆర్పీఎఫ్‌ క్యాంపు పైనే మావోయిస్టులు దాడిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement