Tuesday, April 30, 2024

నైరుతి పవనాలు..ఈ నెల 31న కేరళను తాకే అవకాశం

ఈ ఏడాది రుతుపవనాల సీజన్ తొందరగానే ఆరంభం కానున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను నైరుతి రుతుపవనాల సీజన్ కు మార్గం సుగమం చేయగా, ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాలు సకాలంలో వచ్చేందుకు దోహదపడనుంది. ఈ మేరకు ఐఎండీ వెల్లడించింది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారుతుందని, ఏపీకి 300 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాక దిశ మార్చుకుంటుందని పేర్కొంది. ఇది పశ్చిమ బెంగాల్/బర్మాలో తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక, ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనుండగా, ఈ నెల 21నే అండమాన్ సముద్రంలో ప్రవేశించనున్నాయి. కేరళను తాకడానికి ముందే రుతుపవనాలను అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తాయని ఐఎండీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement