Thursday, May 2, 2024

Railway | రైలు పట్టాలపై లోహపు ముక్క.. రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర!

ఓఖా-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్  రైళ్లను పట్టాలు తప్పించే యత్నం చేసిన ఘటన ఆదివారం రాత్రి గుజరాత్​లోని వడోదరలో జరిగింది. ఈ ప్రయత్నం విఫలమవడంతో పెను విషాదం తప్పిందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.  ఈ సంఘటన గత రాత్రి వర్ణమా, ఇటోలా రైల్వే స్టేషన్ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది ప్రాథమిక విచారణ ప్రకారం.. రైలు పట్టాలు తప్పాలనే ఉద్దేశ్యంతో గుర్తుతెలియని వ్యక్తి ట్రాక్‌పై లోహపు ముక్కను ఉంచినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి వడోదర రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు అందింది. రైల్వే అధికారులు పోలీసులు,ఆర్‌పిఎఫ్‌ సమన్వయంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జిల్లా పోలీస్‌ చీఫ్‌ రోహన్‌ ఆనంద్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది జూన్‌లో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలును ఢీకొన్న ఘటన ఒడిశాలో జరిగింది. ఈ ఘోర ట్రిపుల్ రైళ్ల ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశంలోనే అత్యంత దారుణమైన విషాదంగా రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement