Tuesday, May 7, 2024

పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న భయంతో ప్రేమికుల ఆత్మహత్య..

వికారాబాద్‌, ప్రభన్యూస్‌ : కలిసి చదువుకున్నారు, ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకుందామంటే తమ కుటుంబ పెద్దలు అంగీరించరేమో అని ప్రేమికులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్‌ జిల్లా నవాబ్‌ పేట మండలం గేటు వనంపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నవాబ్‌ పేట మండలం కడిచర్ల గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌(18), ధారూర్‌ మండలం ఎబ్బనూర్‌ గ్రామానికి చెందిన అభినవ(17) కలిసి చదువుకున్నారు. ఇరువురు ప్రేమించుకున్నప్పటికి కులం వారికి అడ్డుగా మారింది. పెద్దలు అంగీకరించరేమో అన్న భయంతో గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇరువురివి వేరు వేరు కులాలు కావటంతో పాటు మైనర్లు అయిన కారణంగా తమ పెళ్లిని అడ్డుకుంటారన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు బావిస్తున్నారు. ప్రేమికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో రైల్వే పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వికారాబాద్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement