Tuesday, April 30, 2024

గోవాలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

క‌రోనా పాజిట‌వ్ కేసులు వేగంగా పెరుగుతుండ‌టంతో గోవా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. ఆ మేర‌కు ఏప్రిల్ 29 రాత్రి 7 గంట‌ల నుంచి మే 3న ఉద‌యం వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్రకటన చేసింది. అత్య‌వ‌స‌ర సేవ‌లు, వివిధ‌ పరిశ్ర‌మ‌లకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు తెలిపింది. అదేవిధంగా అత్య‌వ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా కోసం రాష్ట్ర‌ స‌రిహ‌ద్దులు తెరిచే ఉంటాయ‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ వెల్ల‌డించారు. కానీ, ప్ర‌జార‌వాణా మూత‌ప‌డుతుంద‌న్నారు. క్యాసినోలు, హోట‌ళ్లు, ప‌బ్‌లు కూడా మూసే ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement