Monday, May 6, 2024

ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎంకు సమీక్ష చేసే తీరిక లేదా: రేవంత్‌రెడ్డి ట్వీట్‌..

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ కనీసం సమీక్ష చేయకపోవడం దౌర్భాగ్యమని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారలను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి మంగళవారం ట్వీట్‌ చేశారు.

‘ రెండు వారాల్లో ఇన్ని అత్యాచారాలా..? ‘ అని మండిపడ్డారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర నలుమూలలా రోజు ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఫాంహౌస్‌ సీఎం, డమ్మీ హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం రాష్ట్ర దైర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement