Friday, May 10, 2024

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. తూ.గో. జిల్లాలో 43, విశాఖ జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 26, అనంతపురం జిల్లాలో 26, కర్నూలు జిల్లాలో 21, శ్రీకాకుళం జిల్లాలో 20, కడప జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 13, ప్రకాశం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 7 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ప.గో. జిల్లాలో కరోనా కేసులేవీ నమోదు కాలేదు. గత 24 గంటల్లో 114 మంది కరోనా నుంచి కోలుకోగా కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,94,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,471 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2,382గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,191గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement