Friday, May 17, 2024

RR vs RCB | దంచికొట్టన కోహ్లీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే !

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ జ‌రుగుత‌న్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దంచి కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టాని 183 పరుగులు చేసింది. జైపూర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ చెలరేగాడు. సీజన్‌లో తొలి సెంచ‌రీ బాదాడు. తొలి ఓవ‌ర్ నుంచి విరాట్ డూకుడుగా ఆడుతుండగా.. మ‌రో ఎండ్‌లో కెప్టెన్‌ డూప్లెస‌స్ ధాటిగా ఆడుతూ (44) ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు.

రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తీయగా.. నాంద్రే బర్గర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక 184 పరుగుల టార్గెట్‌తో రాజస్థాన్ చేజింగ్‌కు దిగగా.. తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పొయింది. రీస్ టోప్లీ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (0) డకౌట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement