Sunday, April 28, 2024

TS | బైక్ దొంగలించారని స్వీపర్, ఎస్ఐ, హోగార్డులపై ఆరోపణ..

జన్నారం, (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ ఆవరణలో తాను నివాసముంటున్న క్వాటర్ వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని దొంగలించారని పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఎస్.మహేందర్ (పిసి నెంబర్ 1208) బదిలైన ఎస్ఐ, హోం గార్డు, స్వీపరిలపై చేసిన ఆరోపణల వీడియో వైరలైంది.

నెల క్రితం తాను సెలవుపై వెళ్లి వచ్చి చూడగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని తను నివాసం ఉంటున్న క్వాటర్ వద్ద ఉన్న మోటర్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో స్వీపర్ గా పని చేస్తున్న వెంకటేశ్, ఇక్కడ పని చేసి ఇటీవల బదిలైన ఎస్ఐ సతీష్, హోంగార్డు శ్రీనివాస్ దొంగలించి స్రాప్ కు అమ్ముకున్నారని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు.

ఈ విషయమై అప్పటి ఎస్ ఐ సతీష్ ను శనివారం ఫోన్ లో సంప్రదించగా ద్విచక్ర వాహనం దొంగలించిన విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై కల్పిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక ప్రస్తుత ఎస్ ఐ గుండేటి రాజవర్దన్ ను సంప్రదించగా, ఈ వ్యవహారం గురించి రాత్రి 8గంటల వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

ఆ కానిస్టేబుల్ ఫోన్ లో రామగుండం సిపికి మౌకికంగా రెండు రోజుల క్రితం ప్రైవేట్ స్వీపర్ ,ఎస్ఐ,హోంగార్డులపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ విషయమై మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ కు ఆదివారం ఆ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement