Friday, April 26, 2024

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా కివీస్‌ స్పిన్నర్‌..

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రవేశపెట్టిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ పురస్కారాన్ని కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ దక్కించుకున్నాడు. డిసెంబర్‌ నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా అజాజ్‌ నిలిచాడు. ఈ పురస్కారానికి టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌, ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో అజాజ్‌ పోటీపడ్డాడు. అయితే ఈ పురస్కారం అజాజ్‌కే దక్కింది.

ఇది కూడా చ‌ద‌వండి : ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు చార్జీల బాదుడు.. నగదు విత్‌ డ్రా చేసినా.. ఆలస్యంగా బిల్లు చెల్లించినా.. ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి..

గత నెలలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత సంతతికి చెందిన అజాజ్‌ బంతితో అద్భుతాన్ని పునరావృత్తం చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో టీమిండియా మొత్తాన్ని ఆలౌట్‌ చేసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జిమ్‌లేకర్‌, అనిల్‌కుంబ్లే సరసన చేరాడు. కాగా డిసెంబర్‌లో ఒకే టెస్టు ఆడిన అజాజ్‌ 14వికెట్లు పడగొట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement