Tuesday, April 30, 2024

శ్రీకాకుళం : కిమ్స్ హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్ కిడ్నాప్ నకు య‌త్నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కిమ్స్ హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్ డా. గూడేన సోమేశ్వర రావు కిడ్నాప్ న‌కు దుండ‌గులు య‌త్నించారు. వైజాగ్ నుండి వచ్చిన నలుగురు కిడ్నాపర్లు ఇందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు చూసి వారిని వెంబడించగా… ముగ్గురు తప్పించుకోగా… స్థానికులకు ఓ కిడ్నాపర్ పట్టుబడ్డాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు అతన్ని తరలించారు. బ్లెస్ జిమ్ కింద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈఘ‌ట‌న‌పై రెండో పట్టణ సీఐ ఈశ్వర్ ప్రసాదు, ఇతర సిబ్బంది విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement