Thursday, May 2, 2024

ప్ర‌ధాని మోడీ కోసం – ఆయ‌న ఫొటోతో కూడిన ప్రత్యేక‌మైన రాఖీలు

రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కోసం ప్ర‌త్యేకంగా రాఖీల‌ను త‌యారు చేశారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బృందావ‌న్ కి చెందిన వితంతువులు. మోడీ ఫోటోలతో అందమైన వివిధ డిజైన్లతో రూపొందించిన ఈ రాఖీలను మోడీకి పంపనున్నారు. వితంతువులతో కలిసి దశాబ్దానికిపై పనిచేస్తున్న సులభ్ (Sulabh NGO) స్వచ్ఛంద సంస్థ.. వివిధ నైపుణ్యాలను నేర్చుకునేందుకు శిక్షణనిస్తూ సహాయం చేస్తోంది. వారణాసి, బృందావన్‌, ఉత్తరాఖండ్‌లకు చెందిన వితంతువుల కోసం గత పదేళ్లుగా ఈ సంస్థ పనిచేస్తూనే ఉంది. వారణాసి, బృందావన్‌, ఉత్తరాఖండ్‌లకు చెందిన వితంతువుల కోసం గత పదేళ్లుగా మా సంస్థ పనిచేస్తోంది.. రాఖీలు తయారుచేయడంతో పాటు అనేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తోందని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థ ఉపాధ్యక్షుడు వెల్ల‌డించారు. వారణాసిలోని ఆశ్రమాల్లో నివసిస్తున్న ఈ మహిళలు కొన్నాళ్లుగా ప్రధానికి రాఖీలు కడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండేళ్ల నుంచి ప్రధానిని వ్యక్తిగతంగా కలవలేకపోయారు. బృందావన్‌లో దాదాపు 10,000 మంది వితంతువులు నివసిస్తుండగా.. వారిలో ఎక్కువ మంది పేదలు, నిరక్షరాస్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement