Tuesday, May 7, 2024

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామస్తుడి హత్య.. ఛత్తీస్‌గఢ్​లో మావోయిస్టుల ఘాతుకం

చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు హింసకు తెగబడ్డారు. రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా ఫరాస్‌గావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడహగావ్‌ గ్రామస్థుడిని హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి 10 నుంచి 15మంది సాయుధ మావోయిస్టులు గ్రామంలోకి చొరబ్డారు. గ్రామస్థుడు రాంలాల్‌ పొటై(27)ను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత అడవిలోకి కొంతదూరం తమతో తీసుకెళ్లారు. ఆ తర్వాత మొదట రాంలాల్‌ గొంతుకోసి, తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నందునే రాంలాల్‌కు మరణశిక్ష విధించామని ఘటనాస్థలంలో లేఖను వదిలారు. రాంలాల్‌ మృతదేహాన్ని గ్రామం సమీపంలోనే పడేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement