Thursday, April 25, 2024

బిర్యానీ, మాంసం దుకాణాలు మూసెయ్యాలి.. కాంచీపురంలో పోలీసుల ఆంక్షలు

గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 2, 4వ తేదీల్లో తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో బిర్యానీ, మాంసం దుకాణాలను మూసెయ్యాలని పోలీసులు ఆర్డర్​ వేశారు. దేవాలయాల పట్టణం శివకంచిలోని అన్ని బిర్యానీ, మాంసం దుకాణాలను మూసివేయాలని కాంచీపురం పోలీసులు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. గణేశ్​ విగ్రహాలతో ఊరేగింపు ఈ ప్రాంతం గుండా వెళుతుంది. కాంచీపురం B1 స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఈ ఆర్డర్ జారీ అయ్యింది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 10 రోజుల పండుగగా.. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జరుపుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement