Friday, April 26, 2024

Breaking: బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారానికి నితిన్‌, మిథాలీ ఓకే అన్నారు.. భేటీ వివ‌రాలు వెల్ల‌డించిన ల‌క్ష్మ‌ణ్‌

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశం కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన న‌డ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో నితిన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ స‌మావేశంలో న‌డ్డా, నితిన్‌ల‌తో పాటు బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు పాల్గొన్నారు.

కాగా, న‌డ్డాతో భేటీ ముగించుకుని నితిన్ వెళ్లిపోయిన త‌ర్వాత ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు. నితిన్‌తో పాటు శ‌నివారం మ‌ధ్యాహ్నం జేపీ న‌డ్డాతో భేటీ అయిన మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి సానుకూలత వ్య‌క్తం చేశార‌ని ఆయ‌న చెప్పారు. ఈ దిశ‌గా జేపీ న‌డ్డా చేసిన ప్ర‌తిపాద‌న‌కు వారిద్ద‌రూ అంగీక‌రించార‌న్నారు. ప్ర‌ధాని మోదీ కోసం అవ‌స‌ర‌మైతే బీజేపీ త‌ర‌ఫున ప‌ని చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు చెప్పిన‌ట్లు ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement