Monday, May 6, 2024

Kidnap : బాలుడి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్ప‌గించిన పోలీసులు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాలుడి త‌ల్లి వెంట‌నే ఆర్పీఎఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఒంటగా ఉన్న మహిళ వద్ద బాబుని గుర్తించిన ఓ మహిళ.. ఎలాగైనా ఆ బాబుని ఎత్తుకెళ్లాలని భావించింది. ఆ మ‌హిళ‌తో ప‌రిచ‌డం పెంచుకుంది. ఆమెను పూర్తిగా న‌మ్మిన ఆ తల్లి బాబుని ఆమెకు అప్పగించి వాష్‌రూమ్‌కి వెళ్లింది. తల్లి అటు వాష్ రూమ్‌కి వెళ్ళగానే వెంటనే మహిళ బాబును తీసుకొని పరారయ్యింది. వెంటనే విషయాన్ని గ్రహించిన తల్లి ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయ‌గా.. బాలుడిని రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మహిళను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి… గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. బాబును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కవాడిగుడలో పోలీసులు కిడ్నాప్‌ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాబుని తల్లికి అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement