Monday, May 6, 2024

TS | సేవా పతకాలతో పోలీసులను అభినందించిన ఖ‌మ్మం పోలీస్ కమిషనర్

అత్యుత్తమ సేవలకు గాను హోంమంత్రి మహమూద్‌ అలీ చేతుల మీదుగా సేవ పతకాలను అందుకున్న ఖమ్మం ట్రాఫిక్ పోలీసులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అభినందించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించాయి. ఈనేపధ్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు పలువురు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బందికి పతకాలు ప్రధానం చేశారు.

ట్రాఫిక్ సిఐ అంజలి తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన మరో ముగ్గురు కూడా పోలీస్ సిబ్బందికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ చేతుల మీదుగా పతకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్ కమిషనర్ ని కలిసిన వీరిని ఆయ‌న అభినందించారు. సిఐ అంజలి (ఉతిక్రిష్ట సేవ పతకం), ఎస్సై వెంకటచారి (ఉత్తమ సేవ పతకం), అంత్రిక సురక్ష సేవ పతకం అందుకున్న వారిలో బీమ్ సింగ్ మహార్, కోటేశ్వరరావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement