Wednesday, April 24, 2024

IPL | కీలక మ్యాచ్​లో రెచ్చిపోయిన ముంబయి.. గుజరాత్​ టార్గెట్​ ఎంతంటే?

గుజరాత్​, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్​ ముంబయికి ఎంతో కీలకం కాగా, రెచ్చిపోయిన బ్యాటర్లు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఇందులో 360 డిగ్రీల్లో బాల్స్​ని బాదుతాడనే పేరున్న సూర్యకుమార్​ యాదవ్​ 49 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఇక ముంబయి నిర్ణీత ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా, గుజరాత్​ టార్గెట్​ 219 పరుగులుగా ఉంది..

ఇక.. ఇషాన్​ కిషన్​ (31), రోహిత్​ శర్మ (29), వధేరా (15), విష్ణు (30), టిమ్​ డేవిడ్​ (5) పరుగులు చేయగా.. గ్రీన్​ 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ముంబయి అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు స్కోరు చేసింది. ఇందులో రశీద్​ ఖాన్​ 4 వికెట్లు పడగొట్టగా, మోహిత్​ శర్మకు 1 వికెట్​ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement