Monday, May 6, 2024

MLA పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌ : బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు అడినట్లు ఆడీయో లీకేజ్‌ విడుదలైన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్‌ అయ్యారు. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌, మోదీల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న క్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి హోం శాఖ ప్రత్యేక భద్రతను పెంచింది. రామచంద్ర భారతి, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో నిన్న లీక్‌ అవ్వడంతో పైలెట్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రత బలగాల్లో 4 ప్లస్‌, 4 గన్‌మన్లను కేటాయిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్‌ కూడా మంజూరు చేసింది. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement