Sunday, April 28, 2024

కేసీఅర్ బ‌ర్త్ డే వేడుక‌లు : అన్నదానం ప్రారంభించిన మంత్రి మ‌ల్లారెడ్డి

సీఎం కేసీఅర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈసారి మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మేడ్చల్ నియోజక వర్గంలోని జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఅర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మన పథకాలు లన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement