Wednesday, May 15, 2024

కామాఖ్య అమ్మవారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ క‌విత

అసోంలోని గువ‌హ‌టిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం దర్శించుకున్నారు. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కామాఖ్య ఆల‌యంలో క‌విత ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, దేశ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాల‌ని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్‌ని మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు.

నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా కామాఖ్య దేవిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మికతలో భారతదేశం విరజిల్లుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన అసోంలో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement