Tuesday, May 7, 2024

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత

రాష్ట్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement