Saturday, May 4, 2024

Delhi : ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనుంది.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో వారం రోజుల కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత విజ్ఒప్తితో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించింది కోర్టు. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఎంటరైన సిబిఐ.. కోర్టు అనుమతితో ఏప్రిల్ 11న కవితను జైలు నుంచి అరెస్ట్ చేసి మూడు రోజుల కస్టడీ తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో తొమ్మిది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. అయితే ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించింది. క‌విత పిటిష‌న్‌ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement