Tuesday, May 7, 2024

AP : రేపు నామినేష‌న్ వేయ‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 23న‌ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

23వ తేదీ ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలి వెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement