Sunday, April 28, 2024

వంద‌కోట్ల దిశ‌గా దూసుకుపోతోన్న – కార్తికేయ‌2

వంద‌కోట్ల దిశ‌గా ప‌య‌నిస్తోంది కార్తికేయ‌2 చిత్రం.ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 75.33కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసింది ఈ చిత్రంలో హీరోగా నిఖిల్ న‌టించ‌గా..హీరోయిన్ గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది.. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెర‌కెక్కించాడు .. ఈ నెల 13న‌ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. తెలుగు రాష్ట్రల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ లో ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రోజున అక్కడ 200 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 3వ రోజుకి 700 థియేటర్లకి వెళ్లింది. ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ రోజున ఈ సినిమాకి అమాంతంగా వసూళ్లు పెరిగిపోయాయి.ఇంతవరకూ ఒక్క హిందీలోనే 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement