Tuesday, May 7, 2024

రిష‌బ్ శెట్టి కోపం.. ర‌ష్మిక‌కి శాపం

క‌న్న‌డ నుండి తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లింది హీరోయిన్ ర‌ష్మిక‌మంద‌న్న‌. ఇక అమ్మడి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పడు కర్నాటక లో ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ వివాదం కాంతారా సినిమా కంటే ముందే మొదలయ్యింది అంటారు. కాంతారా తీసిన రిషబ్ శెట్టి రష్మిక ను తన సినిమా కిర్రిక్ పార్టీ ద్వారా పరిచయం చేసాడు.

ఆ సినిమా తర్వాత ఆమె అతనితో మాట్లాడకుండా కృతజ్ఞతలు కూడా చూపించ లేదట. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడుతున్నారు. అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో ఉన్నారట. దీనితో ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నారట. ఇక ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement