Friday, April 19, 2024

కేసీఆర్ కి ధ‌న్య‌వాదాలు.. గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం వినూత్న చర్య.. మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ స‌ర్కార్ రీసెంట్ గా గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని ప్రశంసించారు. గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందన్నారు. దీంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని… కౌన్సిలర్లతో వార్డు అధికారులకు మంచి సమన్వయం నెలకొంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement