Thursday, May 9, 2024

తాళి కట్టే సమయానికి వరుడు మాయం.. అతిథిని పెళ్లాడిన వధువు

యూపీలోని కాన్పూర్ జిల్లా మహారాజ్‌పూర్ పట్టణంలో విచిత్రం జరిగింది. కాసేపట్లో పెళ్లి అనగా కళ్యాణ మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపం నుంచి వరుడు మాయమయ్యాడు. అతడి కోసం వెతికి వేసారిన ఇరు కుటుంబాల సభ్యులు అతడు ఉద్దేశపూర్వకంగానే వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. మరోవైపు మండపంపై ఒంటరిగా మిగిలిన వధువు.. పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒకరిని పెళ్లాడడంతో కథ సుఖాంతమైంది.

కాగా ఒక్కసారిగా మండపంలో వరుడు కనిపించకుండా వెళ్లిపోవడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వధువు కూడా షాక్‌ తింది. పెళ్లి ఆగిపోతే తలవంపులు తప్పవని భావించిన వధువు కుటుంబ సభ్యులు పెళ్లి కొచ్చిన అతిథుల్లో ఎవరైనా తమ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధగా ఉన్నారా? అని ఆరా తీశారు. వారిలో ఒక యువకుడు ముందుకొచ్చి తాను సిద్ధమని చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి జరిపించారు. వరుడు మారడం తప్ప మిగతా అంతా సవ్యంగా జరిగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు, అతడి కుటుంబ సభ్యులపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement