Wednesday, May 8, 2024

అండ‌మాన్..నికోబార్ దీవుల్లో కంగ‌నా..సావ‌ర్క‌ర్ కు నివాళులు..

వివాదాల‌కు కేరాఫ్ గా నిలుస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నార‌నౌత్. ముక్కుసూటిత‌నం..కుండ‌బ‌ద్ద‌లు కొట్టేలా మాట్లాడ‌టం ఆమె నైజ‌మ‌నన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలే కాదు పాలిటిక్స్ పై ..రాజ‌కీయ నాయ‌కుల‌పై త‌న‌దైన విమ‌ర్శ‌లు చేయ‌డంలో మ‌హ‌దిట్ట కంగ‌నా. త‌లైవి చిత్రంతో మ‌రోసారి త‌న‌లోని న‌ట విశ్వ‌రూపాన్ని చూపించింది. కాంట్ర‌వ‌ర్శీల‌కు అంద‌రూ దూరంగా ఉండాల‌ని చూస్తుంటే కంగ‌నా మాత్రం ఎదురెళ్ళి మ‌రీ విమ‌ర్శ‌ల‌పాల‌వుతుంటారు.

కంగ‌నా న‌ట‌న‌లో కూడా మేటి..ఇప్ప‌టికే ప‌లు అవార్డులను అందుకున్న ఈ బ్యూటీ .. జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది.. కాగా రీసెంట్ గా కంగ‌నా రనౌత్ అండమాన్ మరియు నికోబార్ దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా అండమాన్ జైలులోని కాలా పానీ జైలును సందర్శించారామె. పోర్ట్ బ్లేయర్‌లోని కాలా పానీ సెల్యులర్ జైలును సందర్శించారు. స్వాతంత్ర పోరాట వీరుడు వీర్ సావర్కర్‌ను బ్రిటీషులు నిర్భందించి ఉంచిన సెల్‌లో కొంతసేపు గడిపారు. ఆ తర్వాత సావర్కర్‌కు నివాళులర్పించారు.ఈ ఫోటోలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement