Monday, May 6, 2024

పాఠశాలను ప్రారంభించిన మంత్రులు..

కామారెడ్డి : జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ బిబి పాటిల్ ,ప్రభుత్వ విప్ లు గంప గోవర్ధన్‌ ,సునీత రెడ్డి గార్లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి 6 కోట్ల స్వంత నిధులతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సుభాష్ రెడ్డిని మంత్రులు అభినందించారు.పుట్టిన ఊరికి,చదివిన పాఠశాలకు ఎదో చేయాలనే తపన తో అత్యాధునికంగా పాఠశాల నిర్మించటం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement