Thursday, April 25, 2024

ఎమ్మెల్యేకు సంక్షేమ సంఘం సభ్యుల కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని న్యూ వివేకానంద నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో రూ.80 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తయిన సందర్భంగా.. మరో రూ.38 లక్షలతో డ్రైనేజీ పనులు జరుగుతున్న సందర్భంగా, మిగిలిన సీసీ రోడ్లకు రూ.1.06 కోట్లతో టెండర్ ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో మొత్తం రూ.2.24 కోట్లు మంజూరు చేయడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు, సెక్రెటరీ శ్రీనివాస్ రావు, అడ్వైజర్ దాస్ గౌడ్, సురేష్, నవీన్, ముకేష్, భాను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement