Friday, May 3, 2024

శాంసంగ్‌ సాల్వ్‌ ఫర్‌ టుమారో.. ఇన్నోవేషన్‌ పోటీ కోసం జులై 31చివరి తేదీ

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : పట్టణాలు, నగరాలు, గ్రామీణ భారతదేశంలో 10,000కి పైగా యువత ఇప్పటికే శాంసంగ్‌ వారి సాల్వ్‌ ఫర్‌ టు-మారో ఇన్నోవేషన్‌, ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో నమోదయ్యారు. తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలపై సానుకూలమైన సామాజిక ప్రభావాన్ని కలిగి ఉండే వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించడానికి కొత్త వినూత్నమైన సాంకేతిక సమాధానాలు కనుగొనడానికి భారతీయ యువతలో పెరుగుతున్న కోరికను ఇది ప్రదర్శిస్తుంది. దరఖాస్తులకు ఆఖరు తేదీ జులై 31, 2022 అని ఆ సంస్థ తెలిపింది.

పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వ్యవసాయ వ్యర్థాలు, ప్లాస్టిక్స్‌ ను పున: వినియోగించడం వంటి సమస్యలను పరిష్కరించాలని బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ, గౌహతి, భువనేశ్వర్‌ లో శాంసంగ్‌ నిర్వహించిన రోడ్డు ప్రదర్శనలలో యువత పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement